చర్మము మృదువుగా ఉండాలి అంటే ఏమి చేయాలి.
చర్మము మృదువుగా ఉండాలి అంటే ఎం చేయాలి అంటే. ఈ చిట్కాలు పాటిస్తే సరి. రోజు రాత్రి పూట పొడుకునే ముందు పాల మీగడను ముఖానికి రాసుకొని తెల్లవారు జామున చల్లని నీటితో కడిగిస్తే మీ చర్మము మిలమిల మెరిసిపోతుంది.
అలాగే స్నానానికి ముందు నిమ్మరసములో కొంచెం పసుపును కలిపి ముఖానికి రాసుకుంటే మొటిమలు,నల్లటి మచ్చలు చెక్ పెట్టవచ్చు అని బీయూటీషియన్లు చెబుతున్నారు. అలాగే రోజా పువ్వులు చందనాన్ని పేస్ట్ లాగా చేసి ముఖానికి రాసుకొని ఒక అరగంట తరువాత కడిగితే కొన్ని వారాలలో ముఖములో నల్లని మచ్చలు,కంటి కింద వలయాలు కనుమరుగు అవుతాయి. ఇంకా కేస సంరక్షణకు సెంబరుత్తి పువ్వు రసం,నువ్వుల నూనెను సపల్లాలో వేసి చేసి ఆ నూనెను రాసుకోవాలి. ఇంకా కొబ్బరి నూనె లో వేప పువ్వు వేసుకొని వేడి చేసి ఆ నూనెను జుట్టుకు పట్టించటం వలన జుట్టు లో చుండ్రు తగ్గుముఖము పడతాయి. జుట్టు ఇంకా దృడంగా పెరుగుతుంది.